ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై, స్పందన ఫిర్యాదుల పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 04:04 PM

‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 26 జిల్లాల‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాతున్నారు. ఈ సమీక్షలో.. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై, ఖరీఫ్‌ సన్నద్ధతపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఆర్బీకేల నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, ఇరిగేషన్, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com