ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కుతాయి : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 09:46 PM

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని వస్తున్న డిమాండ్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో వారసత్వమే పరమావధి కాదన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి లోకేష్‌కు ఎంత అర్హత ఉందో పార్టీలో యువనేతలకు అంతే అర్హత ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో అధికారం కోసం టీడీపీ పోరాటం చేస్తుంది అని చంద్ర‌బాబు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు.ఈ నేపథ్యంలో పొత్తులపై చంద్రబాబు స్పందిస్తూ.. రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినప్పుడే పొత్తు సాధ్యమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com