టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు వంచనకు వెన్నుపోటుతో పుట్టిన ఉన్మాది అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే మామను హతమార్చాడని ఘాటుగా విమర్శించారు.నా..రా.. అంటే నాసిరకం రాజకీయ నాయకుడు అని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షనేత ఉన్మాది చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘కిక్ బాబు... సేవ్ ఏపీ’’ అనేది మా నినాదం అని చెప్పారు.రామారావు ఎన్నో ఆశలు పెట్టుకుని స్థాపించిన తెలుగుదేశం పార్టీలో రామారావు గారు లేరని అన్నారు. ఇప్పుడు ఉన్న వారు అంత 'కామరావు'లే అని అన్నారు.