ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని కొడుకు, కోడలు మధ్య గొడవలున్నాయి. అయితే తన కూతురిపై లైంగిక దాడి చేశాడని రాజేంద్రపై కోడలు బుధవారం ఫిర్యాదు చేసింది.పోలీసులు పోక్సో కేసు పెట్టారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బహుగుణ గురువారం ఎమర్జెన్సీ పోలీస్ నంబర్ 112కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తన ఇంటి వాటర్ ట్యాంకు ఎక్కి, తుపాకీతో కాల్చుకుని మృతి చెందారు.