తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక విషయాన్ని ప్రకటించారు.నేతలకు సుదీర్ఘ పదవులను రద్దు చేయాలంటూ తాను ఓ ప్రతిపాదన పెట్టానని లోకేశ్ చెప్పారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుని వేరొకరికి ఇస్తానని మహానాడులో వెల్లడించారు. అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇవ్వబోమన్నారు. పని చేయని నేతలకు పదవులు ఇవ్వబోమని ప్రకటించారు. పార్టీలో ఎవరికైనా రెండు సార్లు మాత్రమే పదవులు ఉంటాయని, కొత్త వారికి పదవులు ఇస్తామని చెప్పారు.