ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి శుక్రవారం గుండెపోటు వచ్చింది. 'జగన్నన్న మాట.. కోటంరెడ్డి బాట' కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరుగుతుండగా అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.