లడఖ్లోని తుర్టుక్ సెక్టార్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెస్ట్రన్ కమాండ్కు తరలించేందుకు ఐఏఎఫ్ సాయం కోరినట్లు ఆర్మీవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.