పెళ్లైన మహిళ వెంట పడుతూ వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడేనికి చెందిన యువతికి కాలేజీ రోజుల్లో కర్నూలుకు చెందిన తోటి విద్యార్థి విక్రమ్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కాలేజీ రోజుల్లో తనతో దిగిన ఫొటోలను వివాహిత అత్తకు విక్రమ్ పంపాడు. దీంతో అతడిపై బాధితురాలు గురువారం కేసు పెట్టింది.