ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్తు తెలియని వృద్దుడి మృతదేహం లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 05:02 PM

కోగిలేరు అటవీప్రాంతంలో గల బోడిబండ సమీపంలో సుమారు 60ఏళ్ళ వృద్దుడి మృతదేహం పడివున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు ఈ నెల 26న సాయంత్రం గొర్రెల కాపరి అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుతుండగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడివున్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ స్వర్ణతేజ సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకున్నారు.


స్థానిక సర్పంచ్ రమేష్ బాబు, విఆర్ఓ సుధాకర్, ఎంపీటీసీ పరందామ, పంచాయతీ కార్యదర్శి గణపతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందించారు. ఐతే ఆచూకీ తెలియక పోవడంతో విఆర్ఓ పిర్యాదు మేరకు ఎస్ఐ స్వర్ణతేజ కేసునమోదు చేసి సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సూచన మేరకు సర్పంచ్ రమేష్ బాబు కోగిలేరు అటవీ ప్రాంతంలో పడివున్న గుర్తుతెలియని వృద్దుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com