గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో జగనన్న కాలనీ అందరికి ఇళ్ళు పధకంలో 90 రోజుల ఆప్షన్లో లబ్ధి దారులైన ముగ్గురికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి, తాడేపల్లి తహశీల్దార్ శ్రీనివాస రెడ్డి లు ఇళ్ల పట్టాలను అందజేశారు.
అనంతరం జగనన్న కాలనీ లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న నివాసాలకు వెళ్లి వారి ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సొంత ఇంటి కల జగనన్న వలన నెరవేరిందని ఇందుకు జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.