ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు కోర్టు శుక్రవారం షాక్ ఇచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. జూలై 24, 1999 నుండి మార్చి 5, 2005 వరకు హర్యానా సీఎంగా చౌతాలా ఉన్నారు. ఆ సమయంలో రూ.6.09 కోట్ల ఆస్తులు చట్ట విరుద్ధంగా కూడబెట్టారని 2005లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.