అందరి అధికారులు మాదిరిగా ఆమె ఆఫీసులో కూర్చోలేదు. ఖరీదైన కార్లలో హుందాగా తిరగలేదు. వరద బాధితులను పరామర్శించేందుకు బురదలో తిరుగుతోంది. ఆమే అస్సాం మహిళా ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి. అస్సాంలోని మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టిన ఆమె, ఎన్నో కష్టాలను దాటి ఐఏఎస్ అయింది. ప్రస్తుతం అస్సాంలో వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో బాధితుల కోసం మట్టి, బురద, నీరు అనే తేడా చూడకుండా కలియ తిరుగుతోంది. బాధితులకు భరోసా కల్పిస్తోంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి.