దినేష్ కార్తీక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని, వాటిని అధిగమించి అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నాడని షోయబ్ అక్తర్ ప్రశంసించాడు. టీమిండియా టీ20 జట్టులోకి దినేష్ కార్తీక్ ఇటీవల ఎంపికయ్యాడు. దీంతో అతడిని పాకిస్థాన్ మాజీ దిగ్గజ బౌలర్ అక్తర్ అభినందించాడు. ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరుపున దినేష్ కార్తీక్ రాణిస్తున్నాడు. 14 మ్యాచుల్లో 64.80 స్ట్రైక్రేట్తో 324 పరుగులు చేశాడు. మునపటి ఫామ్ను అందిపుచ్చుకోవడంతో భారత జట్టులో అతడికి చోటు లభించింది.