ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే అర్ధరాత్రైనా వచ్చేస్తా: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 03:36 PM

టీడీపీ కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే అర్ధరాత్రైనా తాను వస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామానికి శుక్రవారం ఆయన వచ్చారు. వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బాధిత నేతలను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనకు తెలియజేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com