ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగులుప్పలపాడులో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:42 PM

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని వైసీపీ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన ఎస్‌. దశరథరామిరెడ్డి అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం పోతవరం గ్రామానికి చెందిన దశరథరామిరెడ్డి తన ఆటోలో ఒంగోలు నుంచి వస్తున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి లారీ ఢీకొంది. దీంతో ఆటో నడుపుతున్న దశరథరామిరెడ్డి అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రమణయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com