ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు కేంద్రం షాక్

national |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:59 PM

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్​ ఇచ్చింది. థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్​ 1న అమల్లోకి రానున్నాయి. కరోనా​ కాలంలో మారటోరియం విధించిన కేంద్రం.. రెండేళ్ల తర్వాత తిరిగి జూన్​ 1న అమలు చేయనుంది. అంతకుముందు బీమా నియంత్రణ ప్రాధికార, అభివృద్ధి సంస్థ వీటిని నిర్ణయిస్తుండగా, ఆ సంస్థ సహకారంతో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వీటిని సవరించింది. కాగా హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు ప్రీమియంలో 7.5 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.


- 1000సీసీ గల ప్రైవేట్​ కార్లకు గతంలో రూ.2,072 ఉండగా ప్రస్తుతం రూ. 2,094 కు పెంచింది.
- 1000 సీసీ నుంచి 1500 సీసీ ప్రైవేట్​ కార్లకు రూ. 3,221 ఉండగా ఇప్పుడు రూ.3,416 కానుంది.
- 1500 సీసీ పైబడిన సొంత కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890 కి తగ్గింది.
- 150సీసీ టూ వీలర్ లకు రూ.1,366 గా, 350 సీసీ వాహనాలకు రూ.2,804 గా నిర్ణయించింది.
- 30 కిలోవాట్​ లోపు గల ప్రైవేట్​ ఎలక్ట్రిక్​ కార్ల ప్రీమియం రూ.1,780.
- 30 నుంచి 65 కిలోవాట్​ మధ్య గల వాహనాల ప్రీమియం ఖరీదు రూ. 2,904.
- 12 వేల కిలోల సరుకు రవాణా వాహనాలకు గతంలో రూ.35,313 ఉండగా ప్రస్తుతం రూ.33,414కు పెంచింది.
- 40 వేల కిలోల పైబడిన సరుకు రవాణా వాహనాలకు ప్రీమియంను రూ.41,561 నుంచి 44,242 కు పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com