ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:35 PM

తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ప్రసిద్ధిగాంచిన మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం లో మూడు రోజులు నుంచి జరుగుతున్నహనుమాన్ జయంతి ఉత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఆలయ అర్చకులు కోమండూరి ఆంజనేయ చార్యులు ఆధ్వర్యం , ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో బుధవారం రాత్రి గ్రామంలో ప్రధాన వీధుల్లో స్వామివారి ఫోటోలు ను మేళతాళాలతో ప్రత్యేక వాహనంపై గ్రామోత్సవం చేశారు.ఈ మూడు రోజులపాటు దేవాలయం లో జరిగిన అన్నదానము కార్యక్రమాలకు, భజన కార్యక్రమాలకు సహకారం అందించిన దాతలకు ఆలయ కమిటీ మేనేజర్ జన్ను వెంకటేశ్వర రావు, ఆలయ కమిటీ చైర్మన్ ముత్యాల రామకృష్ణ, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com