ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, పవన్ పై అంబటి ఫైర్: రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చే కుట్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:48 PM

రాష్ట్రంలో పరిస్థితి శ్రీలంక తరహాలో మారిందని విమర్శించిన చంద్రబాబు అందుకు తగ్గ కుట్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించిన తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా పేరు కోసం ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేనకు చెందిన వారు ఎందుకు నిరాహారదీక్ష చేశారని ప్రశ్నించారు. మీ డిమాండ్ ను, ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించింది కదా అని ప్రశ్నించారు. 


మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను మేమే తగులబెట్టుకున్నామా? అని అడిగారు. ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ అన్నారని... ఇప్పుడు శ్రీలంకను చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటిని తగలబెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారిందని చూపించాలనుకుంటున్నారని చెప్పారు. మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com