ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు, మూడు దశాబ్దాలలో వ్యవసాయ యోగ్యమైన భూములు మాయం: సద్గురు జగ్గీ వాసుదేవ్

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 09:28 PM

భవిష్యత్ లో వ్యవసాయం అన్న మాట వినబడదా...?  కారణం ఏమిటీ అన్న చర్చ  ఇటీవల దోవోస్ లో జరుగుతున్న  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా చర్చ మొదలైంది. వేదికలో వీటిపై నేరుగా చర్చ  ప్రారంభంకాకపోయినా ప్రతినిధుల మధ్య ఈ  ఆసక్తికర చర్చ సాగుతోంది. రానున్న 2, 3 దశాబ్దాల్లో ని ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. 


సారవంతమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉందని సద్గురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, కార్పొరెట్ కంపెనీలు, ప్రజలంతా కలిసి భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా ఇప్పటి నుంచి వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సద్గురు అన్నారు.


స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వేదికపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇషా వ్యవస్థాపకుడు, యోగా గురురు సద్గురు జగ్గీ వాసుదేవ్ కొంత కాలంగా సేవ్ సాయిల్ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


దావోస్ వేదికపై ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులను కలిసి తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. రానున్న 2, 3 దశాబ్దాల్లో ని ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సద్గురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.లండన్ నుంచి కావేరి వరకు తాను నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ ర్యాలీ గురించి కేటీఆర్‌కు సద్గురు వివరించారు. ప్రభుత్వ అధినేతలు, ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమంలో కలిసి రావాల్సిన ప్రాధాన్యం, అవసరం గురించి తెలిపారు.


‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతుంది. ఈ సమస్య వల్ల త్వరలోనే ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది’ అని సద్గురు అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా సద్గురుకు కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ‘హరితహారం’ను అభివర్ణించారు. మరో కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నామని వివరించారు.


వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయోత్పత్తుల పెంపునకు చేస్తున్న కృషిని సద్గురుకు వివరించారు. సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించిన కేటీఆర్.. ఆయణ్ని హైదరాబాద్‌కు ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com