ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు అండగా కాసులు కురిపిస్తున్న మహిళ

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:38 PM

రైతులు పడుతున్న కష్టాలను ఆమె కళ్లారా చూసింది. ఇక తన తండ్రి కూడా స్వయంగా రైతు కావడంతో సాగులో ఇబ్బందులన్నీ గ్రహించింది. వారి కష్టాలను గట్టెక్కించాలని ఆకాక్షించింది. అనుకున్నదే తడవుగా తన చదువు పూర్తైన వెంటనే స్టార్టప్ ఏర్పాటు చేసింది. రైతులకు మార్కెట్ కష్టాలు లేకుండా చేయడంతో పాటు వ్యక్తిగతంగానూ లాభాలు గడిస్తోంది. ఆమె తమిళనాడుకు చెందిన 'ది గుడ్ లీఫ్' సంస్థను స్థాపించిన దీపికా రవి. రైతులకు అండగా నిలుస్తున్న ఆమె వ్యాపార విజయ గాథ వెనుక నేపథ్యమిలా ఉంది.


తమిళనాడులోని కరూర్‌లో దీపికా రవి పుట్టి పెరిగింది. అయితే ఆమె తన స్వస్థలంలోని రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి పడుతున్న కష్టాలను చూసింది. వారికి కష్టార్జితాన్ని లాభాలుగా మార్చి వారికి ఇవ్వాలని దీపికా రవి భావించింది. ఆమె చదువు పూర్తైన వెంటనే తండ్రితో కలిసి 2017లో వ్యాపారాన్ని ప్రారంభించింది. మునగాకులో రన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్ మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయని తెలుసుకుంది. మునగాకుతో రెండు రకాల పొడులను తయారు చేసి విక్రయించింది.


ఆ తర్వాత 2018లో తండ్రితో కలిసి 'ది గుడ్ లీఫ్' సంస్థను స్థాపించింది. కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేస్తూనే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా మునగ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తోంది. వందలాది మంది రైతులకు సహాయం చేస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ప్రస్తుతం 200 మందికి పైగా రైతులు వారి ఉత్పత్తులను తమకు సరఫరా చేస్తున్నట్లు దీపిక గర్వంగా చెబుతోంది. వారి సరుకులకు తగిన ధర చెల్లిస్తున్నామని, రైతులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొంది. మోరింగా(మునగ) పౌడర్, మోరింగ పాడ్స్ పౌడర్ అనే రెండు వస్తువులతో ప్రారంభించి గుడ్ లీఫ్ ఈ రోజు మోరింగా క్యాప్సూల్స్, మోరింగా ఫేస్ ప్యాక్‌ల వరకు వివిధ రకాల వస్తువులను అందిస్తుంది. ఆయా ఉత్పత్తుల ధరలు రూ. 250 నుండి రూ. 490 వరకు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com