ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌ 2022: నేడు లక్నో, బెంగళూరు మధ్య కీలక పోరు

sports |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:22 PM

ఐపీఎల్-2022లో లీగ్ దశ మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠను పంచాయి. చివరికి నాలుగు జట్లు బరిలో నిలిచాయి. ఇప్పటికే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచి ఫైనల్‌లోకి గుజరాత్ అడుగు పెట్టింది. ఈ తరుణంలో బుధవారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి లక్నో, బెంగళూరు జట్ల మధ్య కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందుల్లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్‌తో తలపడనుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో గుజరాత్‌తో తలపడనుంది.


నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచేందుకు లక్నో, బెంగళూరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య కోల్‌కతా లోని ఈడెన్‌గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. నిలకడైన ఆటతీరుతో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు లీగ్ దశలో రాణించింది. మరోవైపు పడుతూ లేస్తూ వచ్చిన బెంగళూరు జట్టు చివరికి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. బెంగళూరు జట్టులో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కాబట్టి బెంగళూరును ఏ మాత్రం లక్నో తేలికగా తీసుకోకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com