క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్-2022 సీజన్ లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఈ క్రమంలో కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసింది. గిల్ 35 పరుగులు, మాథ్యూ వేడ్ 35 పరుగులు చేసాడు.హార్దిక్ 40 పరుగులు, డేవిడ్ మిల్లర్ 68 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్ కాయ్ తలో వికెట్ తీశారు.