ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్-2022 సీజన్ లో 188 పరుగులు చేసిన రాజస్థాన్

sports |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 09:59 PM

క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్-2022 సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ క్రమంలో కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య  మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో జోస్ బట్లర్ 89 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 47 పరుగులు,దేవదత్ పడిక్కల్ 28 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com