కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మహనీయుని పేరును వ్యతిరేకించడం తగదన్నారు. అంబేద్కర్కు కులాన్ని ఆపాదించడం సరికాదన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయన్నారు.కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతిచ్చాయని స్పష్టం చేశారు. ఇదేమీ తొందరపాటు నిర్ణయం కాదు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.