ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తతో యువకుడి ఎఫైర్.. చివరికి దారుణం

national |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 04:39 PM

ఇటీవల కాలంలో జరుగుతున్న పలు హత్యల వెనుక ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని తెలుస్తోంది. కొందరు వివాహ బంధానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తమ జీవితంలో పరాయి వ్యక్తికి చోటిస్తున్నారు. తీరా విషయం బయట పడే సరికి ఆ వివాహేతర సంబంధానికి ఎవరో ఒకరు బలవుతున్నారు. ఇదే కోవలో మేనమామ భార్యతో ఓ యువకుడు ఎఫైర్ పెట్టుకున్నాడు. చివరికి ఈ వ్యవహారం ఇద్దరి మరణాలకు కారణమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రాజస్థాన్‌లోని బికనీర్‌ ప్రాంతానికి చెందిన కుశలరామ్ అనే యువకుడికి అతడి మేనమామ ఉద్రమ్ భార్య గౌరా దేవితో కొంత కాలం క్రితం చనువు ఏర్పడింది. భర్త లేని సమయంలో గౌరా దేవి ఆ యువకుడితో సన్నిహితంగా ఉండేది. చివరికి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటకు పొక్కింది. దీంతో ఉద్రమ్ కోపంతో రగిలిపోయాడు. తన మేనల్లుడు కుశలరామ్‌ను హత్య చేయాలని పక్కా ప్లాన్ వేశాడు. అతడిని పని ఉందంటూ ఆదివారం పొలానికి రప్పించాడు. ఆ తర్వాత దారుణంగా మేనల్లుడిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒంటెపై వేసి, ఊరి బయటకు తరలించి అక్కడ పారేశాడు. సోమవారం కుశలరామ్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేర వేశారు. పోలీసులు ఉద్రమ్‌ను గట్టిగా ప్రశ్నించే సరికి అతడు నేరం అంగీకరించాడు. ఇక తమ విషయం బయటపడడం, కుశలరామ్ హత్యకు గురి కావడంతో గౌరా దేవి భయపడింది. సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన అనైతిక సంబంధం వారిద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com