ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022: నేడు కీలక పోరులో తలపడనున్న గుజరాత్‌, రాజస్థాన్‌

sports |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 11:43 AM

ఐపీఎల్ 15వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్‌ రాయల్స్ మంగళవారం తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. ఓడిపోయిన జట్టు మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. పాయింట్స్ టేబుల్ లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లక్నో, బెంగళూరు జట్లు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. నేడు జరగబోయే మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com