ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాళి కట్టే సమయంలో స్పృహ తప్పిన వధువు.. ఆ తర్వాత ట్విస్ట్‌

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:17 PM

వరుడు తాళి కట్టే సమయంలో వధువు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి ఆమెను కూర్చోబెట్టారు. అయితే వధువు ఈ పెళ్లి చేసుకోనని మొండికేసింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ ఘటన జరిగింది.


హెచ్‌డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేశారు. అయితే పెళ్లి వేడుకలో వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించినట్లు చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో వధూవరుల తల్లిదండ్రులు షాకయ్యారు.


ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా? ఈ పెళ్లి కోసం చాలా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వరుడి తల్లిదండ్రులు గొడవ చేశారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆమె ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com