ఐపీఎల్-2022 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.157 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులకే విజయం సాధించింది. లియామ్ లివింగ్స్టోన్ 49 పరుగుల, శిఖర్ ధావన్ 39 పరుగులు , జానీ బెయిర్స్టో 23, షారుక్ ఖాన్ 19, జితేష్ శర్మ 19 పరుగులు చేసారు. హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. సుందర్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.