ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోచుకొంది దాచుకోవడానికి చంద్రబాబే దావోస్ వెళ్లారు: మంత్రి జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:42 PM

దోచుకొంది దాచుకోవడానికి నాడు చంద్రబాబే దావోస్ పర్యటనకు వెళ్లారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. సీఎం దావోస్‌కు వెళితే టీడీపీకి ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు తన వెంట దోపిడీ దొంగలను తీసుకుని వెళ్లారని.. దోచుకున్న సొమ్మును దాచుకోవటానికి 38 సార్లు తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లి బుల్లెట్ రైలు పక్కన నిలబడి ఫొటోలు తీసుకున్నారన్నారు.


ప్రభుత్వం దావోస్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకుందని.. ఇదంతా చూసి తట్టుకోలేక అనవసరంగా ఊగిపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబంతో వెళ్లకూడదా.. ఎందుకు ఓర్చుకోలేక పోతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ దావోస్ వెళ్లింది రాష్ట్ర అభివృద్ధి కోసమే.. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మంచి జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఏం జరిగిందని చిలవలు వలువలుగా మాట్లుడుతున్నారని.. వీరందరి పాపం పండిందన్నారు. వారు ఎంత ఊగిపోయినా సీఎం జగన్ వెంటే జనం ఉన్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు.


యనమల రామకృష్ణుడి వయసెంత.. మాట్లాడే మాటలు ఏంటని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతిమరుపు రోగం, యనమలకు కడుపు ఉబ్బరం రోగం, పట్టాభికి కడుపు మంట రోగం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన వంచన, దుర్మార్గాలు ఊరికే పోవని.. అన్ని వర్గాలనూ వేధించిన పాపంతోనే 23 సీట్లకు పరిమితం అయ్యారని సెటైర్లు పేల్చారు.


వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి కేసులో ఇరుక్కుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారన్నారు రమేష్. సీఎం జగన్ అన్ని వర్గాలకూ దేవుడని.. తమ ఎమ్మెల్సీపై ఆరోపణలు వస్తే వెంటనే అతనిపై కేసు పెట్టమన్నారని.. చట్టం అందరికీ సమానమే అన్నారు. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ఆయనను జనం నమ్మే పరిస్థితి లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆ 23 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com