ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో ఘోరం జరిగింది...భార్య, భర్తల ధారుణ హత్య

Crime |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 07:10 PM

ఎంతో హుషారుగా క్రికెట్ మ్యాచ్ ను తిలకిస్తున్న ఓ జంట అనూహ్యంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య ఎవరు చేశారు అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్లితే...ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌లో రామ్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ జంటను చంపేశారు. ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్‌ చూస్తున్న సమయంలో భార్య భర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బుధవారం రాత్రి శివం తివారీ (27) అతని భార్య రూబీ (25) టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. రాత్రి 11.30 సమయంలో శివం తండ్రి దీప్ తివారీ నిద్రించడానికి డాబాపైకి వెళ్లారు. డాబాపై పడుకున్న ఆయన గురువారం ఉదయం 6:30 గంటలకు కిందకు వచ్చి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మడుగులో ఉన్న కొడుకు, కోడలు కనిపించారు. దాంతో కేకలు పెడుతూ బయటకొచ్చాడు.


దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ సింగ్ మీనా, జాయింట్ సీపీ ఆనంద్ ప్రకాష్ తివారీ, డీసీపీ వెస్ట్ బీబీజీటీఎస్ మూర్తి, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఘటనపై వివరాలు సేకరించేందుకు మూడు బృందాలను రంగంలోకి దించారు.


ఈ సందర్భంగా ఇద్దరిని చాలా దారుణంగా హత్య చేశారని పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. శివం డెడ్‌బాడీ పక్కనే రూబీ మృతదేహం పడి ఉందని, ఇద్దరి తలలు ఎదురుగా ఉన్నాయని చెప్పారు. ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు. అలాగే ఇంట్లో ఎర్రటి నీళ్లతో నిండిన స్టీల్ సాసర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడు రక్తపు మరకలతో ఉన్న చేతులను లేదా ఆయుధాలను అందులో కడుకున్నట్టు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com