ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా? : రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 11:13 AM

జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకంపై కూడా మాట తప్పి, మడమ తిప్పారు.ఈ ఏడాది జూన్ లో విడుదల చేసే అమ్మఒడికి రూ.13 వేలు మాత్రమే జమ చేయాలనుకోవటం తగదు.2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మఒడి అమలు చేయలేదు.మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ఇప్పటికే రూ.1000 కోత విధించిన ప్రభుత్వం, ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.1000 తగ్గించనుంది.పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.అమ్మఒడి పథకం అమలులో కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మెలికలు పెట్టింది.జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కోతలు లేకుండా, రూ.15 వేలు తల్లులు ఖాతాల్లో జమ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com