ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 08:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమవ్వడం, యూఎస్ ఫ్యూచర్స్ లాభాల్లో పయనించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,534 పాయింట్లు లాభపడి 54,326 వద్ద ముగిసింది. నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266 వద్ద కొనసాగుతోంది. నేడు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్‌లోని అన్ని కంపెనీల షేర్లు ఈరోజు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ (8.10%), రిలయన్స్ (5.77%), నెస్లే ఇండియా (4.74%), టాటా స్టీల్ (4.22%), ఎల్ అండ్ టీ (4.01%) టాప్ గెయినర్లుగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com