ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరులో మామిడి ఎగుమతులు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 12:25 PM

చిత్తూరు వ్యవసాయ మార్కెట్‌లోని మండీల నుంచి మామిడి కాయల ఎగుమతులు మొదలయ్యాయి. గురువారం యార్డులో టేబుల్‌ రకం బేనీషా మామిడి టన్ను రూ. 30-35 వేలు పలుకుతుండగా. పుల్లేర రూ. 14-18వేలు, కాదర్‌ రూ. 38-40వేలు, తోతాపురి(బెంగళూరు) రూ. 17-27వేల వరకు ధర పలుకుతోంది. 


వారం క్రితం బేనీషా టన్ను 55 వేలు ఉండగా. ప్రస్తుతం రూ. 35వేలకు పడిపోయింది. యార్డు నుంచి బేనీషా కాయలు డిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. యార్డులో 10-15 రోజుల్లో వ్యాపారం జోరందుకోనున్నదని మండీల యజమానులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com