ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడరేవు వద్ద సముద్రంలో పిడుగురాళ్ల యువకుడు గల్లంతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 10:00 AM

చీరాల మండలం వాడరేవు వద్ద సముద్రంలో పిడుగురాళ్లకు చెందిన పదహారు ఏళ్ల యువకుడు హితేష్ గల్లంతయ్యాడు. వేసవి సెలవులు కావడంతో పలువురు పిడుగురాళ్ల నుండి సరదాగా గడిపేందుకు వాడరేవు సముద్రతీరానికి వచ్చారు.


వారిలో హితేష్ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కొట్టుకుపోయారు పోలీసులకు సమాచారం అందడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా హితేష్ తో పాటు అతడి తమ్ముడు కూడా వచ్చాడు. అన్న సముద్రంలో గల్లంతు కావడంతో ఆ బాలుడి రోదనకు అంతులేకుండా వుంది. అన్నదమ్ములను తనతో పాటు వెంటబెట్టుకు తెచ్చిన వారి సమీప బంధువైన మహిళ కన్నీటిపర్యంతమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com