ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిన కొడుకు

national |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 04:03 PM

మతి భ్రమించిందో, మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నై నగరానికి చెందిన షణ్బగం(81) అనే మహిళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె రెండో కుమారుడు సురేష్(53) భార్య అతడిని విడిచి వెళ్లిపోయింది. దీంతో సరస్వతి నగర్‌లోని చిన్న కొడుకు వద్దకు కొన్నాళ్ల క్రితం వచ్చింది. ఆమెను చూద్దామని ఆమె పెద్ద కొడుకు శంబగం సోమవారం తన తమ్ముడు సురేష్ ఇంటికి వచ్చాడు. తల్లి గురించి అడిగితే తనకు తెలియదని సురేష్ బదులిచ్చాడు. దీంతో ఆందోళనతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.


పోలీసులు సురేష్ ఇంటికి చేరుకుని ఆరా తీశారు. కొన్నాళ్లుగా అతడు బయటకు వెళ్లడం లేదని చుట్టు పక్కల వాళ్లు తెలిపారు. దీంతో ఇంట్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. చివరికి తల్లి షణ్బగం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి, కాంక్రీట్ మిశ్రమాన్ని పోసి, ఇంట్లోనే సురేష్ పూడ్చాడని తెలుసుకున్నారు. తన తల్లిని ఎప్పటికీ తనతో ఉంచుకోవాలని సురేష్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఇది హత్యా, లేక సహజ మరణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. షణ్బగం మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షణ్బగం కనీసం రెండు వారాల క్రితమే మృతి చెంది ఉండవచ్చని, అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సురేష్ ఆమెను బారెల్‌లో పాతిపెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com