ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు ఆత్మహత్యల్లో 3స్థానంలో నిలిపిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 12:03 PM

నాడు ప్రతిరైతుకు పెట్టుబడిసాయం అన్నారు. నేడు కులవిభజనలు చేసి లక్షలమంది రైతులు, కౌలురైతులకు ఎగనామం పెట్టారు. మద్దతుధర లేదు, ధాన్యం కొనుగోలుచెయ్యరు. ధాన్యండబ్బులు చెల్లించరు. రైతుఆత్మహత్యల్లో 3స్థానంలో నిలిపిన సీఎం జగన్  బటన్లు నొక్కుతూ..మోటార్లకు మీటర్లతో రైతులమెడకు ఉరితాళ్లు వేశారు అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తెలియచేసారు. నిన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమాన్ని ఆదేశించి, అందులో జగన్ అన్ని ఒట్టి  అబద్దాలు మాత్రమే పలికారని , వాస్తవ పరిస్థితులు అలా లేవు అని తెలియచేసారు. రైతు భరోసా యాత్రలని పెట్టి కేవలం ప్రతిపక్షాల మీద విష ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ మాని  ప్రజలకి మేలు చేసే దిశగా ముందుకు సాగాలని హితవు పలికారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com