ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : సన్‌రైజర్స్ కి 178 పరుగుల టార్గెట్ ఇచ్చిన కోల్‌కతా

sports |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 09:54 PM

ఐపీఎల్-2022 ప్లే ఆఫ్‌ రేసులో స్థానం గల్లంతు అవనున్న తరుణంలో క్లిష్ట పరిస్థితుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాణించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన పోరులో ప్రత్యర్థి ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టులో ఆండ్రూ రస్సెల్ రఫ్ఫాడించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులతో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శామ్ బిల్లింగ్స్ (34), ఆజింక్య రహానే (28), నితీష్ రాణా (26) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లతో రాణించాడు. భువనేశ్వర్, మార్కో జాన్సన్, నటరాజన్ ఒక్కో వికెట్‌తో రాణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com