ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 09:35 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2022 నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఈ విషయాన్ని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు వెల్లడించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 10వ తేదీ వరకు స్వీకరిస్తామని ప్రకటించారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షను జూలై 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com