ఎండలు భగభగ మండే వేసవిలో పుదీనా, కీరదోసతో తయారు చేసే ఓ డ్రింక్ను తాగి బయటకు వెళ్తే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఆ డ్రింక్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తయారు చెయ్యటం చాలా ఈజీ. ఇందుకోసం మీదగ్గర పెరుగు, పుదీనా, కీరదోస, అల్లం, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు ఉంటే సరిపోతుంది. ముందుగా పుదీనా, అల్లం, కీరదోస తరుగును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెరుగును చిక్కని మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. మీకు చల్లగా కావాలనుకుంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అంతే... రుచికరమైన చల్లని పుదీనా కీరదోస జ్యూస్ రెడీ అయినట్టే.