విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని డౌనూరు ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంబసింగి ఘాట్ రోడ్డులో ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎదురెదురుగా వస్తున్న బైక్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడగా క్షతగాత్రుడ్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.