గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ లో రెండు కంటైనర్లలో రవాణా చేస్తున్న మూడు వేల కేజీల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.15,000 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇదే పోర్టులో రెండు రోజుల క్రితం రూ.9000 కోట్ల విలువైన 2988 కేజీల హెరాయిన్ పట్టుబడింది.