ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటోడ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 12:28 PM

కేరళ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఓ ఆటోడ్రైవర్‌ను అదృష్టం వరించింది. ఓనమ్ పండుగ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో ఓ ఆటోడ్రైవర్‌ విజేతగా నిలిచాడు. అతడికి రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఆదివారం వెల్లడించిన ఓనం బంపర్‌ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కోచి సమీపంలో మరాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ పీఆర్‌ జయపళన్‌ కొనుగోలు చేశాడు. జయపళన్ కొనుగోలుచేసి టిక్కెట్‌కు లాటరీ వరించడంతో అతడు ఆనందంతో ఉబ్బితబ్బుబ్బియ్యాడు. ఈ విషయం గురించి జయపళన్ మాట్లాడుతూ..‘‘ఈ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశాను.. ఫ్యాన్సీ నంబర్‌ కావడంతో లాటరీ బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను’’ అని జయపళన్‌ తెలిపారు. రూ.12 కోట్ల లాటరీ బహుమతిలో 30 శాతం పన్నులు, 10 శాతం ఏజెంట్ కమిషన్ పోగా ఆయనకు రూ. 7.5కోట్లు లభించనున్నాయి. అదృష్టం ఒక్కసారి పలకరిస్తే.. ఆ మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందనడానికి ఆటో డ్రైవర్ జీవితమే ఉదాహరణ. కేరళలో ప్రభుత్వమే లాటరీ నడుపుతూ.. దీనిని ఓ పథకంగా అమలుచేస్తూ రోజూ డ్రా నిర్వహిస్తోంది. లాటరీ ప్రైజ్ కింద రూ.70-80 లక్షల వరకు అందజేస్తోంది. రోజువారీ లాటరీలతోపాటు వీక్లీ, పండుగల వేళ ప్రత్యేక లాటరీలు కూడా ఉంటాయి.


విన్-విన్, కారుణ్య, స్త్రీశక్తి, పౌర్ణమి వంటి పేర్లతో వీక్లీ లాటరీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్లను అమ్మి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో లాటరీ వేస్తారు. కొన్ని దశాబ్దాల్లో ఈ లాటరీల ద్వారా వేలాది మంది జీవితాలు బాగుపడ్డాయి. నిబంధనల ప్రకారం టిక్కెట్ ఎవరు కొనుగోలు చేస్తారో వారికే బహుమతి తీసుకునే అర్హత ఉంటుంది. ఈ ఏడాది క్రిస్మస్-న్యూఇయర్ లాటరీ‌లో టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తిని అదృష్టం వరించింది. అమ్ముడుపోని టిక్కెట్‌కు లాటరీ తగిలింది. రూ.12 కోట్ల అతడికి దక్కాయి. తమిళనాడులోని టెన్‌కాశీకి చెందిన షరాఫుద్దీన్.. గల్ఫ్‌ దేశాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చివరకు కేరళకు వచ్చి స్థిరపడ్డాడు. కేరళ కొల్లాం జిల్లా ఆర్యంకవు సమీపంలోని ఎరావిధర్మపురంలోని ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసె వేసుకుని, లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనూహ్యంగా అమ్ముడవని టిక్కెట్‌కు లాటరీ తగిలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com