భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. వీరు గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్ (మార్చి), క్లైమేట్ చేంజ్ సమ్మిట్ (ఏప్రిల్), జీ-7 (జూన్) సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ చివరి సారిగా అమెరికాకు 2019లో వెళ్లారు. హోస్టన్లో నిర్వహించిన 'హౌడీ గోడీ' అనే కార్యక్రమంలో అమెరికాకు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి పాల్గొన్నారు.
''వాషింగ్టన్లో సెప్టెంబర్ 24న నిర్వహస్తున్న క్వాద్రిలేటరల్ ఫ్రేమ్వర్క్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ అధ్యక్షుడు యోషిహిడే సుగ, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బిడెన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సెప్టెంబర్ 25న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు'' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.