నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జలాశయం సమీపంలో ఎవరూ రాని ఓ ప్రదేశంలో మనిషి ఆకారంలో భయంకరంగా బొమ్మను గీసి బొమ్మ చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కొబ్బరి చిప్పలను పెట్టి క్షుద్ర పూజలు చేశారు. దీంతో అటుగా వెళ్ళిన కొందరు గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.