వాటర్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి. బెంగళూరులోని కావేరి తాగునీటి పైప్ లైన్ కోసం తవ్విన గుంతల్లో పడి 47 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన బెంగళూరులోని పిన్యా కాలనీ, కేశరఘట్ట రోడ్డులో ఓ స్కూల్ సమీపంలో జరిగింది. పిన్యాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పనిచేసే ఆనంద్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్కూల్ సమీపంలో ఉన్న గుంతను గమనించకపోవడంతో బైక్ గుంతలోకి దూసుకుపోయింది. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
తవ్విన గుంత వద్ద ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం బారికేడ్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ గుంత ఉన్న విషయాన్ని వాహనదారులు గమనించలేకపోతున్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో తవ్విన గుంతలను కాంట్రాక్టర్ ఇప్పటికీ పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.