ఐపీఎల్-2021 లో సోమవారం బెంగళూరు రాయల్ ఛాలెంజెర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా 7 మ్యాచ్లాడి 2 విజయాలు నమోదు చేసిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్లోనూ గెలవాలి. మరోవైపు బెంగళూరు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు లాడి 5 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్ గా ఇదే తన చివరి సీజన్ అని కోహ్లీ ప్రకటించడంతో ఆ జట్టు ఈసారైనా ఛాంపియన్ గా నిలుస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తుది జట్లు: (అంచనా)
కేకేఆర్: నితీశ్ రాణా, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్కోటి/శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, కైల్ జెమీసన్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్