ఇండియాలో గడిచిన 24 గంటల్లో 30,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 295 మంది కరోనా వల్ల మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478,419 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,27,15,105 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 4,45,133 మంది కరోనా వల్ల మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 3,18,181 యాక్టివ్ కేసులున్నాయి.