ఏపీలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురవడం వల్ల ఓ విద్యార్థి ఆశ నిరాశగా మారింది. చదువు కోసం దాచుకున్న డబ్బు బూడిదయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు అగ్రికల్చర్ బిఎస్సీ చదవడం కోసం రూ.20 లక్షలు కూడబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పిడుగుపాటుకు ఇల్లు దగ్ధమైంది. తాను దాచుకున్న డబ్బు కూడా కాలి బూడిదవ్వడంతో మహేష్ విలపిస్తున్నాడు.