ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ టైంలో సబ్బులు వాడుతున్నారా..?

national |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 06:12 PM

నెలసరి అంటే మహిళలకు.. చెప్పలేని ఇబ్బంది. ప్రతి నెల వచ్చే పిరియడ్స్ అనేక మానసిక, శారీరక సమస్యలను కలిగిస్తోంది. కడుపు నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, కోపం, చికాకులు ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందులో ఆ సమయంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారు.


ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కాకుండా నియంత్రణలో ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రంగా కూడా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అవుతుంది. అలా అయ్యే బ్లీడింగ్ అనేక రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. దీనివల్ల చికాకు, దద్దుర్లు ఏర్పడతాయి. మూతనాళాల్లో ఇన్ఫెక్షన్లకు తలెత్తుతాయి. అందుకే ప్రతి నాలుగు, ఆరు గంటల్లోపు న్యాప్‌కిన్లు మార్చుకుంటూ ఉండాలి. రక్తస్రావం జరిగే చోట క్రమం తప్పకుండా కడుక్కుంటూ ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.


కొంతమంది మహిళలు ఎక్కువ రక్తస్రావం అవుతుందని ఒకేసారి రెండు నాప్ కిన్లను యూజ్ చేస్తుంటారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల అంటువ్యాధులకు కారణం అవుతుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్టిరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక పాడ్ ఉపయోగించడం మంచిది. ఎక్కువ రక్తస్రావం సమయంలో తరచుగా నాప్ కిన్ మార్చుకోవడం మంచిది. తరచూగా నాప్ కిన్‌లను మార్చడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుంది.


రక్తస్రావం జరిగే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బులు ఉపయోగించకూడదు. ఈ కృత్రిమ పరిశుభ్రత ఉత్పత్తులు వాడడం వల్ల అంటువ్యాధులు, బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తోంది. రుతుస్రావ సహజ ప్రక్రియను దెబ్బతీస్తాయి. పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com