ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్మశానంలో అస్థిపంజంరంతో డ్యాన్స్ వేసిన మహిళ

international |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 02:41 PM

యూకేలో హల్ సిటీలోని శ్మశానంలో శనివారం మధ్యాహ్నం సన్యాసిని నృత్యం చేయడం, అస్థిపంజరంతో ఆడుకోవడం కలకలం రేపుతోంది. ఎవరూ లేని ఆ శ్మశానానికి ఆ మహిళ ఒంటరిగా వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఓ అస్థి పంజరం దగ్గర నిలబడింది. వెంటనే ఆ ఆస్తి పంజరంతో ఆడుకోవడం, నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఈ సంఘటన హల్ జనరల్ శ్మశానవాటిక సమీపంలో జరిగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ప్రయాణిస్తున్న వారు చూశారు. వాహనాలు కూడా కాసేపు ఆపేశారు. ఆ సమయంలో సన్యాసిని అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ సన్యాసిని లాగా దుస్తులు ధరించింది. ఇది కాకుండా, తలపై కండువా కూడా ధరించింది. ఈ వింత సంఘటనను శ్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు షాక్‌‌కు గురవుతున్నారు. ఆ మహిళకు మతి స్థిమితం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ శ్మశానాన్ని ఇపుడు ఉపయోగించట్లేదట. 50 ఏళ్లుగా అది మూసే ఉంది. 1847లో దానిని ప్రారంభించారు. 1972లో మూసివేశారు. కాగా, ఆ సమాధిలో కలరాతో చనిపోయిన దాదాపు 187 మృతదేహాలను ఖననం చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com